]ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15 : విద్యార్థులను స్టార్టప్లు ప్రారంభించే వారిగా తీర్చిదిద్దేందుకు రానున్న ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో ఇండియా స్టార్టప్ ఫెస్ట్ – 24(India Startup Fest – 24)ను నిర్వహిం చనున్నారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను ఓయూ అధికారులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించి, సరైన వాతావరణం నెలకొల్పేందుకు ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్), ఉస్మానియా ఫౌండేషన్ (ఓఎఫ్) చేతులు కలిపాయని చెప్పారు.
ఓయూలో నిర్వహించనున్న ఈ ఫెస్ట్లో ప్రముఖ వక్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టబడిదారులు ఒకే వేదికపైకి వస్తారని వివరించారు. ఓఎఫ్, ఐఎస్ఎఫ్ మధ్య సంబంధాల ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఐఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జేహెచ్ చౌదరి, ఓఎఫ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ దేవరకొండ, టీఐఈ గ్రాడ్ చైర్మన్ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.