ఖైరతాబాద్, మే 6 : తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మలక్పేట యశోద దవాఖానకు తరలించారు. తొమ్మి ది రోజులుగా చికిత్స అందిస్తున్న వైద్యులు బ్రేయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. దీంతో జీవన్దాన్ కోఆర్డినేటర్లు అవయదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించగా, వారు అంగీకరించారు. మధుసూదన్ శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లు సేకరించారు.