హైదరాబాద్ : అప్పుడే పుట్టిన ఆడపిల్లను నాచారంలోని జనప్రియ కట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. నాచారం డివిజన్లోని జనప్రియ అపార్ట్మెంట్ వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆడపిల్ల పుట్టిందని వదిలి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపడంతో పసిపాపను చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగానే ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.