Nehru Zoo | హైదరాబాద్ : వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కుకు సందర్శకులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. అయితే ఆదివారం ఒక్కరోజే 30,361 మంది జూపార్కును సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మే 19న 25 వేల మంది జూ పార్కును విజిట్ చేశారు. నిన్న 30,361 మంది సందర్శించారు. వచ్చే ఆదివారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.