హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రశసన్ నగర్లో మొక్కలు నాటిన బిగ్ బాస్- 6 కంటెస్టెడ్ నేహా చౌదరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేహా చౌదరి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.