మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 14: నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు.ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 17950 ఇండ్ల ఉండగా ఆస్తిపన్ను రూ. 18 కోట్ల లక్ష్యానికి గాను రూ. 8 కోట్ల 63 లక్షలు వసూలు చేసిన అధికారులు టార్గెట్ ను ఛేదించేందుకు ప్రణాళికాబద్ధ్దంగా ముందుకు సాగుతున్నారు. ఇంకా రూ. 9 కోట్ల 37 లక్షలను వసూలు కావాల్సి ఉంది.
ఆన్లైన్ ద్వారా కూడా ఆస్తి పన్నులు చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులపై దృష్టి సారిం చాం.మున్సిపల్ కార్యాలయం లో ఉదయం నుంచి సాయం త్రం వరకు ప్రతి రోజూ కౌంటర్లో పన్నులు చెల్లించవచ్చు. సకాలంలో పన్ను లు చెల్లించి మున్సిపాలిటీ అధివృద్ధికి సహకరించాలి.
– ఎ.వాణి రెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ