ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 2: ప్రకృతి సిద్ధ పానీయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు. యువతీ యువకులు కూల్డ్రింక్స్కు అలవాటుపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని వాపోయారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు దగ్గర ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలూరు గౌరీశంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బహుళ జాతి సంస్థలు కూల్డ్రింక్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. కూల్డ్రింక్స్లో ఆరోగ్యానికి హానిచేసే ఎన్నో పదార్థాలు ఉం టాయన్నారు. వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని అభి ప్రాయపడ్డారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఆది నారాయణ, ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, డాక్టర్ అందె సత్యం, రాజా, చంద్రశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.