హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో మహిళా సాధికారత, భద్రతపై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన ఆశా మాల్వియాను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. మహిళలు ఒంటరిగా ఉన్నా.. ధైర్యంగా ఉండగలరనే సందేశాన్ని ఇస్తున్న ఆమెకు అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆశా చేపట్టిన 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర.. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నది. శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆమె డీజీపీని కలిశారు. మహిళల భద్రత, ‘సే నో టు డ్రగ్స్’పై విస్తృత ప్రచారం కల్పిస్తుండటాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2022 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభించిన ఆశా యాత్ర ఇప్పటివరకు ఎనిమిది రాష్ర్టాల్లో సాగింది.
డీజీపీ అంజనీకుమార్ను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిసి.. పలు భద్రతా అంశాలపై చర్చించారు.