సుల్తాన్బజార్,జూలై 1 : నిస్వార్ధంగా పేద రోగులకు చేసేది పవిత్రమైనది వైద్య వృత్తి అని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. శనివారం ఉస్మానియా దవాఖానలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాల వైద్యులతో కలిసి కేక్కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా ప్రతి యేడాది జూలై 1న జాతీయ డాక్టర్స్ డేను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. సమాజంలో డబ్బులు సంపాదించాలంటే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని, పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవల ందించేందుకు గాను వైద్య వృత్తిని ఎంచుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రమేశ్, డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, ఏడి నెహ్రూ, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ ఎండీ రఫీ, డాక్టర్ అనురాధ, డాక్టర్ కవిత, డాక్టర్ విజయ్కుమార్లతో కలిసి కేక్కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సుల్తాన్బజార్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి, కె రమేశ్, రవి కుమార్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ను, ఆర్ఎంవో డాక్టర్ రఫీని పుష్పగుచ్ఛం అందించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపి ంచారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు క్యాతం రాధాక్రిష్ణ ఆధ్వర్యంలో ఉస్మానియా చాంబర్లో వైద్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కోఠిలోని ఐఎంఏ భవనంలోని డాక్టర్ జీ కిర్లోస్కార్ హాల్ లో ఐఎంఏ హైదరాబాద్ సిటీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి, లోక్సత్తా వ్యవస్థాపకుడు, ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని అభివర్ణించారు. భవిష్యత్తులో ఇదే తరహాలో వైద్యులు సేవలందించాలని ఆకాంక్షించారు. ఐఎంఏ సిటి శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేడాది రాజకీయ తత్వవేత్త, ఫిజీషియన్ డాక్టర్ బీసీ రాయ్ను స్మరిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎంఏ సిటి శాఖ అధ్యక్షుడు డాక్టర్ దయాల్సింగ్, సెక్రటరీ డాక్టర్ బి ఉమాకాంత్గౌడ్, కోశాధికారి డాక్టర్ ఎస్ విజయ్కుమార్లతో కలిసి వైద్య రంగం, సామాజిక రంగాలలో పేద ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న ఐఎంఏ హైదరాబాద్ సిటీ శాఖ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ గట్టు శ్రీనివాసులు తదితరులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ పల్లం ప్రవీణ్కుమార్, డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్,ఐఎంఏ హైదరాబాద్ సిటీశాఖ సభ్యులుపాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణకు సీఎం కేసీఆర్ కృషి
అబిడ్స్, జూలై 1: తెలంగాణ రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వైద్య శాఖకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశిశ్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బేగంబజార్ యూపీహెచ్సీ దవాఖానలో ఆయన వైద్యులు, వైద్య సిబ్బందిని సన్మానించారు.
జియాగూడలో…
జియాగూడ, జూలై 1 : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకోని జియాగూడ డివిజన్ శాంతినగర్ శ్రీ శ్లోకా హై స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ వినయ్కుమార్, డాక్టర్ శ్వేతలను శనివారం ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, వైస్ ప్రిన్సిపాల్ అమితా, బీఆర్ఎస్ సినియర్ నాయకులు ఘనంగా శాలువ పూలబోకేలతో సన్మానించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంతటి నర్సింహ్మ కూమారులు ఒకరు డాక్టర్, మరోకరు లాయర్, మరోకరు పోలీసు విధులు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పారశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.