హైదరాబాద్ : అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతో జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డులు(National Awards) వరించాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ( Mayor Vijayalakshmi) అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023 కింద హైదరాబాద్ నగరానికి ఐదు అవార్డులు (Awards) సాధించిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన న్యూ ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్, కేంద్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
శుక్రవారం ఈ అవార్డులను శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని ప్రధాన కార్యక్రమంలో కలిసి అవార్డులు అందజేశారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది, అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతో అవార్డులు సాధించుకున్నామని, రానున్న సంవత్సరంలో జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డులు మరిన్ని రావాలని ఆమె ఆకాంక్షించారు. అందుకు అధికారులు, కార్మికులు, ప్రజల సహకారం అవసరమని మేయర్ కోరారు.