శంషాబాద్ రూరల్, జూన్ 26 : శంషాబాద్ నుంచి నర్కూడ వరకు రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నర్కూడ గ్రామస్తులు, నాయకులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నిర్లక్ష్యంతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
పనులు చేయలేని ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసన తెలిపిన వారిలో మాజీ జడ్పీటీసీ సతీశ్, కుమార్యాదవ్, మహేశ్యాదవ్, కృష్ణయాదవ్, కృష్ణ, నాగేశ్, మహేశ్గౌడ్, శ్రీకాంత్గౌడ్, బాబు ఉన్నారు.