హైదరాబాద్ : నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్ను ఈ నెల 10వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నుమాయిష్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గత 80 ఏండ్ల నుంచి నుమాయిష్ను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది నుమాయిష్ను నిర్వహించారు. ప్రతి ఏడాది నుమాయిష్ జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. నుమాయిష్కు ప్రతి రోజు దాదాపు 50 వేల మంది వస్తుంటారు. ఈ 45 రోజుల్లో 20 లక్షల మంది నుమాయిష్ను సందర్శిస్తారు.