బంజారాహిల్స్, మార్చి 13 : రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి దీవకొండ ఆండాళమ్మ ద్వాదశ దినకర్మ సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ నేత కేవీపీ.రామచందర్రావు, చంద్రశేఖర్ రెడ్డి,
బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, ఆరూరి రమేశ్, ఎలక్షన్రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎల్.రాజం, మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, జెన్కో, ట్రాన్స్కో మాజీ సీఎండీ ప్రభాకర్రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కె.శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి.చిరంజీవి, నెట్వర్క్ ఇన్చార్జి శ్రీనివాస్రావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో ఓరుగంటి సతీష్, సీజీఎం ఆపరేషన్స్ సీహెచ్ శ్రీనివాస్, డీజీఎం సర్యూలేషన్ రాంరెడ్డి, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేష్ తదితరులు నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు దామోదర్రావుతో పాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు.