మల్కాజిగిరి, అక్టోబర్ 20 ;నేను నాయకున్ని కాదు.. సేవకున్ని. ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద నమ్మకంతో మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మల్కాజిగిరి ప్రజలకు ఆరాచక శక్తుల నుంచి విముక్తి కల్పించి ప్రజల మధ్య సామరస్యమైన వాతావరణాన్ని కల్పిస్తానంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వివరాలన్నీ ఆయన మాటల్లోనే…
మల్కాజిగిరి ప్రజల వద్దకు వెళ్లి పలుకరిస్తే అనూహ్య స్పందని వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వచ్చే ప్రభుత్వంలో మరింత పెరుగనున్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టడంతో ప్రజలకు ఆనందం కలిగింది.
భూ సమస్యను పరిష్కరిస్తాం
మల్కాజిగిరి సర్కిల్ సర్వే నంబర్ 278లో 22 కాలనీలలో దాదాపు 80 వేల మంది నివసిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వారికి భూమి హక్కులు లేవు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి గజానికి రూ.250తో రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చని జీవోను ఇచ్చారు. 80 వేల మందికి ఊరట రావడం నాకు తృప్తినిచ్చింది. రానున్న రోజుల్లో మీతోఉండి భూ సమస్యలను పరిష్కరిస్తాను.
రూ.10కోట్లతో వాటర్ రిజర్వాయర్..
గౌతంనగర్, వినాయక్నగర్, మల్కాజిగిరిలో కొంత భాగంలో నివస్తున్న వారికి పుష్కలంగా నీటి సరఫరా జరుగుతున్నా.. గుట్టలపై ఉన్న ఇండ్లకు నీటి సరఫరా సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం గౌతంనగర్ డివిజన్లో రూ.10కోట్లతో వాటర్ రిజర్వాయర్ కట్టించి ప్రజల దాహార్తిని తీరుస్తాం.
రైల్వే చక్రబంధాల నుంచి విముక్తి
మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ల పరిధిలోని వాజ్పేయినగర్, గౌతంనగర్, వినాయక్నగర్, బొల్లారంలో ఉన్న రైల్వే గేట్ల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాజ్పేయినగర్ రైల్వే గేటు వద్ద ఆర్యూబీ నిర్మిస్తామని చెప్పినా ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైల్వే చక్రబంధాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తా.
అరాచక శక్తులపై ఉక్కుపాదం
మల్కాజిగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరిని అడిగా ఒకటే మాట. మాపై దౌర్జన్యం చేస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరాచక శక్తులను ఓడించేందుకు ఓటు హక్కును వినియోగించాలి.
మ్యానిఫెస్టోకు మంచి స్పందన
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోకు మంచి స్పందిన వచ్చింది. సన్న బియం, కుటుంబ బీమా, రూ.400లకు గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీలో రూ.15లక్షలకు పెంపుదల వంటి సంక్షేమ పథకాలు ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయను
బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వడంతో ఆనందంగా ఉంది. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మల్కాజిగిరి సీటును సీఎంకు బహుమతిగా ఇస్తాను.