హైదరాబాద్, జనవరి 3 : అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, (పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఇతర అధికారులు అరణ్య భవన్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపునకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
అటవీ అధికారులు, సిబ్బంది అడవుల పరిరక్షణకు నిరంతరం పని చేస్తున్నారని అభినందించారు. నూతన సంవత్సరం సందర్భంగా అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి (పీసీసీఎఫ్) ఆర్.శోభ కేక్ కట్ చేసి, న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే.సిన్హా, సునీత భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.