ఖైరతాబాద్, అక్టోబర్ 13: ప్రతి కార్మికుడి వివరాలను ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదు చేయాలని అడిషనల్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్ కోరారు. బుధవారం లక్డీకాపూల్లోని ది సెంట్ హోటల్లో జన్ సాహాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-శ్రామ్ వలంటీర్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గంగాధర్ పలు సూచనలు చేశారు. అసంఘటితరంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం కేంద్రం ఈ పోర్టల్ను తీసుకువచ్చిందన్నారు. జన్ సాహాస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ-శ్రామ్ పోర్టల్ ద్వారా కార్మికులకు అవగాహన, నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. కార్యక్రమంలో జన్ సాహాస్ సంస్థ ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కో ఆర్డినేటర్లు ప్రకాశ్ కుమార్, బ్రహ్మం, అధికారి రాకేశ్, సుమలత, విజయ్, కవిత, అశోక్, ఆనంద్, సందీప్ పాల్గొన్నారు.