చార్మినార్, సెప్టెంబర్ 26: నగరంలోని మూసీ నదిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ కన్వీనర్ మణికొండ వేదకుమార్ తెలిపారు. సెప్టెంబర్ 4వ ఆదివారం మనుగడలోని నదుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం మూసీ పరివాహక ప్రాంతంలో ‘సేవ్ మూసీ’ వాక్ను నిర్వహించారు. సాలార్జంగ్ మ్యూజియం నుం చి శివాజీ బ్రిడ్జ్ వరకు ఈ సందర్భంగా నిర్వహించిన వాక్ లో ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్థ నిర్వాహకులతో పాటు పలు పాఠశాలలు, కళశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మూసీ పరిరక్షణ వాక్ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. గ్రీన్ఛాలెంజ్లో భాగంగా వేద కు మార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, ఎన్కే పటేల్, నవీన్ పిప్లాని, ఐఏఎస్ అధికారి హరిప్రీత్సింగ్, నరేంద్రసింగ్, మహమద్ షఫియుల్లా, సయ్య ద్ అనివుల్లా హసన్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.