శంషాబాద్ రూరల్ : ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని తవ్వి అమ్ముకుంటు సోమ్ముచేసుకుంటున్న సంఘటన మండలంలోని పెద్దషాపూర్తండా పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 220లో జరుగుతోంది. ఆదే గ్రామానికి చెందిన కొందరు ఎర్రమట్టిని తవ్వి అమ్ముకుంటున్నట్లు రెవెన్యూ అధికారులకు స్థానిక సర్పంచ్ నీలనాయక్ సమాచారం ఇచ్చిన సంబంధిత కిందిస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం సర్పంచ్ తహసీల్దార్, ఆర్డివో చంద్రకళకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేసినట్లు చెప్పారు.
దీంతో స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మట్టితవ్వుతున్న జేసీబీని ఆదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానిక వీఆర్ఏ శివ తెలిపారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నీలనాయక్ అధికారులను కోరారు.