మన్సూరాబాద్, ఏప్రిల్ 21:ఆటోనగర్లోని డంపింగ్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న ఫ్లవర్ గార్డెన్కు అడ్డంకులు తొలగిపోయాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న ఫ్లవర్ గార్డెన్ విషయంపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటోనగర్ డంపింగ్ యార్డు విషయంలో శ్రీభవాని ఎంటర్ప్రైజెస్ సంస్థ కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు ముం దుకు వచ్చారని, ఈ కేసుకు సంబంధించిన పత్రాలు సదరు సంస్థ ఇవ్వగానే కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
కేసు ముగియగానే ఆటోనగర్లోని డంపింగ్ యార్డులోని వ్యర్థాలు తొలగించే పనులను ఏడు సంస్థలకు అప్పగించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మూడు, నాలుగు నెలల్లో డంపింగ్ యార్డును పూర్తిగా ఎత్తివేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్భుతమైన పార్కును ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.