దుండిగల్, జూన్ 16 : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా మొక్కలు పెరుగుతున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఎంపీ సంతోష్రావు పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.