హైదరాబాద్: నిత్య జీవితంలో బిజీగా ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ పీస్ను ఎంపీ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని చెప్పారు. గార్డెన్ అభివృద్ధికి అసోసియేషన్ చేస్తున్న కృషికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తన వంతుగా రూ.10 లక్షలు కేటాయించారు. రన్లో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తమ వంతుగా రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. అంతకుముందు బొటానికల్ గార్డెన్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు.