హైదరాబాద్ : సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కలిశారు. శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన గజానన్ మాల్యతో వారు సమావేశమయ్యారు. లింగంపల్లి రైల్వే స్టేషన్లో సుమారు అరగంట పాటు రైల్వే సమస్యలపై చర్చలు జరిపారు.
చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల పలు రైల్వే సమస్యలపై చర్చించారు. రైల్వే సమస్యలు ప్రజల సమ్మతితో తీర్చాలని కోరారు.
ఈ సందర్భంగా పలు సమస్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. వారి వెంట స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నే శ్రీనివాస్ రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.