సిటీబ్యూరో, మార్చి 30 : చారిత్రక,వారసత్వ కట్టడాల పరిరక్షణకు బల్దియా వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, చార్మినార్ను సుందరంగా తీర్చిదిద్దగా..తాజాగా మౌలాలీ కమాన్కు కొత్త సొబుగులు అద్దారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తీర్చిదిద్దిన ఈ కమాన్ను త్వరలో ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. 1578లో కమాన్ చిత్రం.. పునరుద్ధరణ తర్వాత చిత్రాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.