Hyderabad | హైదరాబాద్ : నగర పరిధిలోని మాదాపూర్ – కేపీహెచ్బీ కాలనీల మధ్య ఘోరం జరిగింది. ఈ మార్గంలో వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపాడు. అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దించేశాడు. ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగినట్లు డ్రైవర్ తెలిపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు చెలరేగడంతో మాదాపూర్ – కేపీహెచ్బీ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కారును రోడ్డు పక్కకు నెట్టేసి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు.