హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటి సాక్షి విసిరిన చాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు ఆశిష్ గాంధీ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమం అన్నారు. ఇందులో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు జగపతి బాబు, నటి దివి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.