ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 11: సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీల్లో శుక్రవారం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, నాగేశ్వర్రావు, ఆకాశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రజక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు డాక్టర్ రాగళ్ల గంగాధర్, బర్లపాటి జయరామ్, కొన్నె సంపత్, గోలి నర్సింహ, రాములు, లింగమయ్య, అరుణ్, వెంకట్, విజయ్ కుమార్, శివ, మహేశ్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. ఆమె తెగువ మహిళా లోకం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.