ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 28: కరోనా నివారణ కోసం అర్హలైన ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. తార్నాకలోని స్ట్రీట్ నెంబర్ 13, 14 ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయినందున సంబంధిత సర్టిఫికెట్ను శనివారం అందజేశారు. తార్నాక డివిజన్ నాగార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, అధికారులు, సిబ్బంది, స్థానిక కాలనీ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.