హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గజదొంగకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. కోటిపల్లి చంద్రి అనే దొంగ.. తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. నిందితుడి వద్ద 57 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కూకట్పల్లి పరిధిలో 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. చంద్రిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10, సంగారెడ్డి జిల్లా పరిధిలో 33 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చినప్పటికీ చంద్రి ప్రవర్తనలో మార్పు రాలేదని సీపీ పేర్కొన్నారు.