కుత్బుల్లాపూర్, నవంబర్ 28 : సీసీ కెమెరాలతో మరింత రక్షణ పొందవచ్చని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్, రాఘవేంద్రకాలనీలో కాలనీవాసుల సౌజన్యంతో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పా టు చేసుకున్న 14 సీసీ కెమెరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేశ్తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని.. కాలనీలో ఎలాంటి నేరాలు చోటు చేసుకోకుండా కాలనీవాసులంతా స్వచ్ఛం దంగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మల్సూర్, కాలనీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు బాల రాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్గౌడ్, స్థానిక నాయకులు కుంట సిద్ధిరాములు, ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బాచుపల్లి క్రాంతినగర్లోని వేంకటేశ్వరస్వామి ఆల య ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రా రంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, వెంకటసుబ్బారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశం ముదిరాజ్, కార్పొరేటర్ బాలాజీనాయ క్, ఆలయ అర్చకులు రామకృష్ణ, నర్సింహాచార్యులు, చైర్మన్ మాధవరం కాంతారావు, వైస్ చైర్మన్ జీవీ రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.