Musi River | సిటీబ్యూరో, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ ) : దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ‘మూసీ రివర్ అండ్ హెరిటేజ్ ఇంటర్ ఫేస్ వాక్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలిస్ట్ డాక్టర్ హైదర్ మాట్లాడుతూ.. మూసీ నదితో హైదరాబాదీలకు ఉన్న గాఢమైన భావోద్వేగ బంధాన్ని వివరిస్తూ.. ‘ మూసీకి నా హృదయంలో ప్రత్యేక ప్రాముఖ్యత’ ఉందన్నారు.
అనంతరం సంస్థ చైర్మన్ వేదకుమార్ మాట్లాడుతూ.. నది గొప్ప చరిత్రపై అందరికీ అవగాహన కల్పించేందుకు మూసీ తీరం వెంట ‘నడక’ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. 1908 నాటి వరదలను ప్రస్తావిస్తూ ఆనాటి బాధితుల ప్రాణాలను కాపాడడంలో చింతచెట్టు ప్రాముఖ్యతను వివరించారు. ప్రకృతి వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని వేదకుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.