హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తన తోపుడు బండి తెచ్చి ఇచ్చే వరకు టవర్ దిగానని మోహన్ బాబు మొండికేశాడు.
దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కొత్త తోపుడు బండిని ఇప్పిస్తామని, కిందకు దిగాలని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత మోహన్ బాబు విద్యుత్ టవర్ పై నుంచి కిందకు దిగాడు. అతనికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.