Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో జనాలు తడిసి ముద్దయ్యారు. అక్కడక్కడ రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఉద్యోగులు తమ విధులు ముగించుకుని ఇళ్లకు బయల్దేరే సమయానికి వర్షం కురియడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజలు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, సికింద్రాబాద్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ముషీరాబాద్, చిలకలగూడ, చిక్కడపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ, గచ్చిబౌలి, రాంనగర్తో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.