సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో 45 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తూ సోమవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 1 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన అధికారులు.. కొత్త టైం టేబుల్ను విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి పది లోకల్ రైళ్లను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మొత్తం 55 సర్వీసులు రాక పోకలు సాగించనున్నాయి. ఫలక్నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-బేగంపేట్-లింగంపల్లి-తెల్లాపూర్- రామచంద్రాపూర్ ప్రాంతాల్లో 29 రైల్వే స్టేషన్ల మీదుగా మొత్తం 50 కిలోమీటర్ల వరకు రైళ్లు నడవనున్నాయి.