దుండిగల్, మార్చి 8 : ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజుపై సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం జీడిమెట్ల, పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీడిమెట్ల సీఐ పవన్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘జై భారత్, జై తెలంగాణ న్యూస్’ఐడీతో కొందరు వ్యక్తులు ఎమ్మెల్సీ శంభీపూర్రాజుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుడు డి.విజయరాంరెడ్డి, సూరారం డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్, సుంకరి శివముదిరాజు, నాగేశ్, విజయ్కుమార్, సాయిరెడ్డి, నాగరాజు, రవికిరణ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పేట్బషీరాబాద్ పీఎస్లో కొంపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ యువనాయకుడు రావల్కోల్ సాయికిరణ్గౌడ్ ఫిర్యాదు చేశారు.