కూకట్పల్లిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ రూ. 90 లక్షల వ్యయంతో మాధవరం సుశీల మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించారు. ఆధునిక వసతులు కల్పించారు. ఈ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే మాధవరం
కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, కుర్మయ్యగారి కొండల్రావు, జిల్లా విద్యాధికారి విజయకుమారితో కలిసి ప్రారంభించారు. కూకట్పల్లి రాజీవ్గాంధీనగర్లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్సీ నవీన్కుమార్ తాత మాధవరం రాంచందర్రావు జ్ఞాపకార్థం కోటి రూపాయలను వెచ్చించి పునర్ నిర్మించారని ఎమ్మెల్యే అన్నారు.
అలాగే కూకట్పల్లిలో అమ్మమ్మ మాధవరం సుశీల జ్ఞాపకార్థం పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించి సకల హంగులు కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహయాదవ్, పండాల సతీశ్గౌడ్, సబీహా గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.