శేరిలింగంపల్లి, మార్చి 22: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యపదాలు వాడుతూ, ఆమె ఫొటోలు మార్ఫింగ్చేసి వీడియోలు షేర్ చేసిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గచ్చిబౌలి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలు మార్ఫింగ్చేసి అసభ్యపదజాలంతో వీడియోలు రూపొందించి వాటిని సోషల్మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈనెల 20న గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, వెహిచర్ల గ్రామానికి చెందిన బొల్లి చంద్రశేఖర్(25)గా గుర్తించారు. చంద్రశేఖర్ను బుధవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.