సికింద్రాబాద్, ఏప్రిల్ 8 : లష్కర్ జిల్లా సాధనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం లష్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధుల బృందం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రాష్టంలో పలు నూతన జిల్లాలను ఏర్పాటు చేశారాని కవిత గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తప్పకుండా సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాయడంతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశంలో కౌన్సిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని లష్కర్ సాధన సమితి ప్రతినిధులకు ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్, శైలందర్, సునీల్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ చారి, కృష్ణ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.