హైదరాబాద్ : మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఎమ్మెల్సీ కవిత తన సానుభూతిని తెలిపారు. అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత వారి కుటుంబాన్ని పరామర్శించారు. సనత్ నగర్లోని అల్లం నారాయణ ఇంటికి వెళ్ళి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అల్లం పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని కవిత భగవంతుడిని ప్రార్థించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కూడా ఆయన ఇంటికి వెళ్లి తమ సానుభూతిని ప్రకటించారు.