హైదరాబాద్ : రానున్న రోజుల్లో వ్యాపారం వైపు ఆసక్తి చూపించాలనుకున్న మహిళలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెక్నాలజీ ద్వారా లాభం పొందవచ్చని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నగరంలో COWE అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కవిత.. అక్కడికి విచ్చేసిన 150 మంది మహిళా వ్యాపారవేత్తలతో తన అనుభవాలను పంచుకున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనివ్వడానికి కోవే లాంటి సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కోవిడ్ సమయంలో అనేక మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయి ఇప్పటికి ఉద్యోగాలలో జాయిన్ కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు.
మహిళలందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన సమయం ఇది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉందని కవిత వెల్లడించారు.