కుత్బుల్లాపూర్, మార్చి 15 : ప్రజలకు సేవ చేసేందుకు తాను మీ ముందుకు వచ్చాను.. ఎప్పుడే ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి వాటిని పరిష్కరించడమే తన లక్ష్యం.. కోట్ల రూపాయలతో అభివృద్ధికి బాటలు వేశాం… ప్రజా సంక్షేమమే తన కర్తవ్యంగా కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా ముం దుకెళ్తున్నాం… ప్రజలకు మౌలిక వసతులు కల్పించి..ప్రజల్లో చిరునవ్వును చూడటమే తన లక్ష్యంగా పని చేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన ప్రగతియాత్రలో ప్రజలకు భరోసాను ఇస్తున్నా రు. తాను చేపట్టిన ప్రగతియాత్ర బుధవారం నాటికి 22వ రోజుకు చేరింది. చిన్నా చితకా అనే తారతమ్యం లేకుండా నియోజకవర్గంలోని ప్రజలంతా తన కుటుంబ సభ్యులంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముం దుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో కలిసి ఆయన వెంకటేశ్వరనగర్, వాణినగర్, ఇంద్రసింగ్నగర్లలో విస్తృతంగా పర్యటించారు. ఆయా కాలనీల్లో దాదాపుగా డ్రైనేజీలు, సీసీరోడ్ల పనులు పూర్తి చేసుకున్నాయని, మిగిలిన వర్షపు నీటి నాలా నిర్మాణానికి తగిన చొరవ చూ పాలని ఎమ్మెల్యే దృష్టికి ఆయా కాలనీవాసులు తీసుకెళ్లారు. వెంటనే సంబంధింత శాఖా అధికారులతో ఫోన్లో మాట్లాడి, లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో ఏర్పడే ఇబ్బందులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో కమ్యూనిటీహాల్స్, కొత్త కరెంటు కేబుల్ వంటితో పాటు ఇతర సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలను అందించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం…
సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ల సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అంతర్గతంగా ప్రతి వీధిలో భవిష్యత్తరాలకు అందుబాటులోకి వచ్చేలా డ్రైనేజీ నిర్మాణాలు, సీసీరోడ్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. గతంలో వర్షాలు వచ్చినా..చిన్నపాటి వరదకు..నిత్యం పొంగిపొర్లే డ్రైనేజీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానికుడిగా తాను సమస్యలను చూశాను…అలాంటి సమస్యలకు చరమగీతం పాడేందు కు ప్రత్యేక చర్యలు తీసుకున్నానని తెలిపారు. ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అవి త్వరలోనే పరిష్కారానికి వస్తాయని అన్నారు. రాబోయే రోజు ల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మీ అందరి సహకరంతో ముందుకెళ్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్రావు, పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిశోర్చారి, శ్రీనివాస్, వెంకటేశ్రావు, కేశవ్రెడ్డి, వెంకటేశ్రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశం, భగవాన్రెడ్డి, ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.