హైదరాబాద్ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం సందర్భంగా స్వామి వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani), పద్మారావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా, భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మూడో ఆదివారం సందర్భంగా దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువ జాము నుంచే కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టువద్ద ముడుపులు చెల్లించుకున్నారు.