మారేడ్పల్లి, ఫిబ్రవరి 3 : క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ క్రీడా మైదానంలో కాసాల రామస్వామి లక్ష్మీదేవి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ను(,volleyball competitions) ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసు కొని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు. క్రీడకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, ఆదయ్య నగర్ వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దినేష్ ఆనంద్, సెక్రటరీ విజయానంద్, మల్లేష్, భీమ్రావు, త్రిభువన్, తదితరులు పాల్గొన్నారు.