బంజారాహిల్స్/బేగంపేట్,జనవరి 1: శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి , సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆయన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో అమ్మవారికి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, కోషికే కిరణ్మయి కిషోర్, నాయకులు శ్రీనివాస్గౌడ్, కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.