బేగంపేట్, డిసెంబర్ 5 : ప్రభుత్వంలో లేమని అధైర్య పడాల్సిన పని లేదని, అన్నింటికీ మీకు అండగా నేనున్నానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తలసాని శ్రీనివాస్యాదవ్కు అభినందనలు తెలిపారు.
ఈ సంధర్భంగా తలసాని మాట్లాడుతూ… ఎవరికీ ఏ అవసరమొచ్చినా మొదటి నుంచి తాను అండగా నిలిచానని, ఇక ముందు కూడా ఉంటాననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్యాదవ్, బేగంపేట్ కార్పొరేటర్ దంపతులు మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నాయకులు కిరణ్మయి కిశోర్, అమీర్పేట్ డివిజన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్సింగ్, మీడియా ప్రతినిధులు, బ్రాహ్మణవాడి, జెక్ కాలనీ తదితర ప్రాంతాల వారు తలసాని శ్రీనివాస్యాదవ్కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.