హైదరాబాద్ : తన గెలుపు సనత్ నగర్(Sanathnagar) నియోజకవర్గ ప్రజల విజయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును స్వాగతిస్తామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందన్నారు. ప్రజలు మార్పును కోరుకున్నారని వారి తీర్పును శిరసావహిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్(Congress party)కు శుభాకాంక్షలు తెలిపారు.