బేగంపేట మార్చి 25: బేగంపేట బ్రాహ్మణవాడిలోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని( Nallapochamma temple) సోమవారం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani) దర్శిం చుకున్నారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహా ప్రతిష్టాపన జరిగి 40 రోజులు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన మండల పూజలో అయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ పండితులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను వేద మంత్రాలతో అశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, ఆరీఫ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.