బేగంపేట్, జూలై 7 ఇటీవల తీ వ్ర అస్వస్ధతకు గురైన సీనియర్ పాత్రికేయుడు (నమస్తే తెలంగాణ) బి.నర్సింగ్రావు బైపాస్ సర్జరీ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ బోయిగూడలోని నివాసంలో నర్సింగ్రావును పరామర్శించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్న తరువాత నర్సింగ్రావు కుటు ంబ సభ్యులకు ధైర్యం చెబు తూ ఆర్ధిక సహాయాన్ని అందించారు.
త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవనంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జర్నలిస్ట్ మహేందర్, బన్సీలాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశన్ రాజు, నాయకులు మహేష్, ప్రేమ్, వెంకట్, అబ్బాస్, నాగభూషణం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తలసానికి కృతజ్ఞతలు..
బైపాస్ సర్జరీ జరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నమస్తే తెలంగాణ పాత్రికేయుడు బి.నర్సింగ్రావును పరామర్శించి, ఆర్ధిక సహా యం అందించడం పట్ల మాజీ మం త్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు తెలంగాణ వర్కింగ్ జర్నిలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇ.చంద్రశేఖర్ జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తలసాని పరామర్శ నర్సింగ్రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిందన్నారు.