బేగంపేట్, జనవరి 12 : బేగంపేట్ పాటిగడ్డలో రూ. 6 కోట్ల వ్యయంతో జి+2లో నిర్మితమవుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, వివిధ శాఖల అధికారులతో కలిసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. లిఫ్ట్ ఏర్పాటుతో పాటు డ్రైనేజీ పనులు మిగిలిపోయాయని కార్పొరేటర్ మహేశ్వరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను పేదలకు నామమాత్రపు ఫీజుకే అద్దెకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణాలు, దేవిడిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని ఖబరస్థాన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
కార్యక్రమంలో జలమండలి డీజీఎం శశాంక్, జీహెచ్ఎంసీ డీఈ సంతోష్, టౌన్ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఏఈ తిరుమలేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ నాయీ, శేఖర్, ఆరిఫ్, అఖిల్, మొయిన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.