అమీర్పేట్, జనవరి 11 : పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం అమీర్పేట్ డివిజన్లోని కుమ్మరిబస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు కుమ్మరి బస్తీలో మంజూరైన మంచినీరు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం వంశీకృష్ణలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్ని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ ఇందిర, డీఈఈ మోహన్, స్ట్రీట్లైట్స్ డీఈ కిరణ్మయి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం. హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.