ఖైరతాబాద్, జనవరి 14 : 2014లో తొలుత కైట్ ఫెస్టివల్ ప్రారంభించిందే బీఆర్ఎస్ సర్కారు అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో కైట్ ఫెస్టివల్ను ప్రారంభించి స్వయంగా పతంగులను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో పతంగులను తెచ్చుకొని, మాంజా తయారు చేసుకొని ఎగురవేసేవారమని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, అత్తిని శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, శైలేందర్, నాగులు, బాబురావు, ఆనంద్ పాటిల్, అరుళణ్ భట్, మహేందర్, ఆరీఫ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.